*బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు మాతృవియోగం*
బోధన్: ఏప్రిల్ 10
బోధన్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత షకీల్,ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది.
గతకొంత కాలంగా అనా రోగ్యంతో బాధపడుతున్న షకీల్ తల్లి ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు.
దవాఖానలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మరణించారు. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, గురువారం అచన్ పల్లిలో ఆమె అంత్యక్రి యలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.