ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం చేస్తామన్న సీతక్క
ప్రశ్న ఆయుధం న్యూస్ మే కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల తొలగించిన జడ్పిటిసి,ఎంపీటీసీ స్థానిక ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ వినతిపత్రం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
ఏజెన్సీ ప్రాంత జిల్లాలు ఖమ్మం, వరంగల్, అదిలాబాద్, మహబూబ్నగర్ ఉమ్మడి 4 జిల్లాలు 75 మండలాలు సుమారు పది లక్షల జనాభా కలిగిన ఎస్సీ కులాలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో తీరని అన్యాయం జరిగిందని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులతో పాటు దళితులను సమానంగా అభివృద్ధి జరిగే విధంగా న్యాయం చేయాలని కోరారు.తరతరాలుగా నివసిస్తున్న ఇంటిపైన సాగు చేస్తున్న భూములకు ఆంక్షలు లేకుండా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.స్పందించిన మంత్రి సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర జిల్లా నాయకులు.సలిగంటి కొమరయ్య,కండే రాములు,రాస మల్ల నరసయ్య,సుందర్ పాల్, ఉoడ్డేటి దేవరాజ్,శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
ఎస్సీ కులాలకు జడ్పిటిసి ఎంపీటీసీ రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేసిన బొమ్మెర శ్రీనివాస్
by Naddi Sai
Published On: May 30, 2025 9:31 pm
