ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల అభివృద్ధి సంక్షోభంలో పడింది ప్రభుత్వం ఆదుకోవాలి కోరారు
ప్రశ్న ఆయుధం న్యూస్ మే 31 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
తెలంగాణ రాష్ట్రంలో సగం భూభాగం వెనుకబడ్డ ఏజెన్సీ ప్రాంతం ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షోభంలో పడిందని అభివృద్ధిలో వెనుకబడ్డ ఎస్సీ కులాలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ వినతి పత్రం అందజేశారు.కొత్తగూడెం రుద్రంపూర్ సింగరేణి కాలరీస్ జిఎం ఆఫీస్ కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా శనివారం బట్టి విక్రమార్కను కలిసి గోడు వెలిబుచ్చారు.ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక రిజర్వేషన్ జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎస్సీ రిజర్వేషన్ జనరల్ లో కలపడం వల్ల లక్షలాదిమంది ఎస్సీ కులాల తరఫున రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు 2025 స్థానిక ఎన్నికల్లో ఎస్సీ కులాల జడ్పిటిసి ఎంపీటీసీ రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు.తరతరాల సాగు భూములకు పోడు భూములకు ఆంక్షలు లేకుండా హక్కు పత్రాలు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలో వెనకబడ్డ ఎస్సీ కులాలను గిరిజనులతో పాటు అభివృద్ధి చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అభ్యుదయ కళాకారుడు భారతరత్నఅవార్డు గ్రహీత అంబేద్కర్ ఇష్టం డాక్టర్ మద్దెల శివకుమార్,షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి గౌరవ సలహాదారు సింగరేణి రిటైర్డ్ జిఎం అందే ఆనందరావు,
మంద వెంకటేశ్వర్లు,షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు సలిగంటి కొమరయ్య,ఎనగంటి శ్రీనివాస్, మంగలిగిరి పుల్లయ్య,బల్లెం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు బొమ్మెర శ్రీనివాస్ విన్నపం
by Naddi Sai
Published On: May 31, 2025 7:09 pm
