అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లికి బోనాలు

*అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లికి బోనాలు*

*పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని తల్లికి మొక్కులు చెల్లించిన ముదిరాజు కులస్తులు*

*మత్స్య సంపద వృద్ధి చెంది తాగునీటికి కొరతగా లేకుండా చూడాలని తల్లిని వేడుకున్న ముదిరాజులు*

*జమ్మికుంట ఇల్లందకుంట జూన్ 25 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ ప్రజలను చల్లంగా చూడు తల్లి అని ముదిరాజ్ కులస్తులు అంగరంగ వైభవంగా పెద్దమ్మతల్లికి బోనాలను సమర్పించి భోజనాలు నిర్వహించారు ప్రతి సంవత్సరం పెద్దమ్మతల్లి బోనాల ఉత్సవాలలో భాగంగా మండలంలోని శ్రీరాములపల్లి గ్రామనికి చెందిన ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మతల్లి బోనాల జాతరను కనుల పండుగ నిర్వహించి వనభోజనాలు చేసుకున్నారు ప్రతి ఇంటి నుండి పెద్దమ్మ తల్లి బోనాలను తీసుకొని వచ్చి పెద్ద మొత్తంలో మహిళలు డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ గ్రామపురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి మొదటగా పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించి నా తర్వాత పలువురు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీరాములపల్లి గ్రామ ముదిరాజ్ కులస్తులు పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగిందని గత సంవత్సరం 20 లక్షల రూపాయలతో పెద్దమ్మతల్లి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగిందని, ఆ పెద్దమ్మ తల్లి కృపా కటాక్షాలు శ్రీరాములపల్లి గ్రామ ప్రజలపై ఉండి సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండుకుండలా ఉండి మత్స్య సంపద పెరిగి మత్స్యకారులకు లాభ కలగాలని గ్రామంలోని పాడిపంట గోడ్డుగోదా చల్లగా ఉండి గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ పెద్దమ్మ తల్లిని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిప్పరబోయిన మొగిలి, అధ్యక్షుడు రామస్వామి ఉపాధ్యక్షుడు సమ్మయ్య కుల పెద్దలు స్వామి వీరస్వామి సారయ్య,శ్రీరాములపల్లి, గ్రామ ముదిరాజ్ కులస్తుల తో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment