అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గుండాలే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం

ప్రశ్న ఆయుధంన్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్- సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే రేగా చెల్లని రూపాయి మాటలు అన్నారు. పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం మీద చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్.- ప్రజలు బుద్ధి చెప్పినా.మీ బుద్ది మారలేదు. వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి వెనుక బీ ఆర్ ఎస్ అరాచక శక్తుల కుట్రేనని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గొడిశాల రామనాధం అన్నారు. బుధవారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలు వారి దిగజారిన రాజకీయాలకు అద్దం పడుతుంది అని రామనాధం అన్నారు. రాజకీయాలలో హుందాగా మాట్లాడాలని.ఆ హుందా తనం మీలో లోపించిందని.చిల్లర మాటలు మా విధానం కాదని, చెల్లని రూపాయి మాటలు మాట్లాడి, ప్రజల్లో ఇంకా చులకన కావోద్దని హితవు పలికారు. నాడు ఎన్నికల సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావు ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవనివ్వనని ప్రగల్భాలు పలికి. మీ సీటు నే 35 వేల మెజారిటీ తో చిత్తు చిత్తుగా ఓడిపోయింది మర్చిపోవొద్దు అన్నారు. పది రోజుల్లో మంత్రిని అయ్యి వస్తా అన్నావు. పత్తా లేకుండా పోయావు.. పదివేల మెజారిటీతో గెలవబోతున్నాము.కార్యకర్తలు సంబరాలకు సిద్ధం కండి అని అన్నావు, అదీ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు భద్రాచలం లో ఉప ఎన్నిక కు సిద్దం అవుతున్నారు, అధికారం కోసం అర్రులు చాచటం మీకే చెల్లిందన్నరు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని. గౌరవప్రద రాజకీయాలు చేయాలని సూచించారు. వికారాబాద్ లో బీ ఆర్ ఎస్ ప్రేరేపించిన, వారి అనుచరుల ముసుగులో ఉన్న గూండాలను తక్షణమే అరెస్టు చేసి, శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశం లో మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడుముల లక్ష్మారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాస రెడ్డి, బండారు సాంబశివరావు, స్వాతంత్ర రెడ్డి, పాయం అప్పారావు, పాడి హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now