ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 8
ఘనంగా మహిళా దినోత్సవం, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజం మార్పు కోసం పాటుపడుతున్నారని బిఆర్ఎస్ పార్టీ ఫౌండర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు సిలివేరి సత్యనారాయణ ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ పరిధిలో సిలివేరి సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళ నాయకురాలు మున్సిపల్ మాజీ వార్డు కౌన్సిలర్ల తో కలిసి మహిళా దినోత్సవని ఘనంగా నిర్వహించారు.. కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి పట్టణ మహిళా నాయకురాలు మరియు మాజీ కౌన్సిలర్లను శాలువాతో ఘనంగా సత్కరించారు..సందర్భంగా వారు మాట్లాడుతూ
సృష్టికి మూలమైన స్త్రీని ఒకప్పుడు వంటింటి కుందేలుగా చూశారు ఇప్పుడు ఆమె అంతరిక్షపు అంచులను తాకి వస్తోంది. పురుషుడే బలవంతుడని… స్త్రీ బలహీనురాలని భావించే రోజులు పోయాయి. పురుషులతో సమానంగా మహిళలు కూడా ముందడుగు వేస్తున్నారు. విజయాలు సాధిస్తున్నారు. ఉన్నత శిఖరాలకు చేరుతున్నారు. దానికి ఉదాహరణ ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్. మగవారితో సమానంగా ఆమె కూడా అంతరిక్షం అంచులను చూస్తోంది. స్త్రీ అడుగుపెట్టని రంగమే నేడు లేదు. మనిషి ఉనికికి కారణమైంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను గౌరవించే దినోత్సవం. ఒక మగవాడి విజయం వెనుక ఒక తల్లి, చెల్లి, అక్క, కూతురు…ఇలా ఎవరో ఒక స్త్రీమూర్తి ఉండే ఉంటారు. వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలు చేసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ జీవితంలో మీకు అండగా నిలిచిన మహిళలకు మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ మహిళా కమిటీ నెమలి ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొక్కు సరిత, ఉపాధ్యక్షురాలు, గండ్రతి చంద్రావతి, కడగల నారాయణమ్మ, పింకీ లోద్, మదార్బి, సల్మా, రెహనా,ఇల్లందు మున్సిపల్ తాజా మాజీ వార్డ్ కౌన్సిలర్ కటకం పద్మావతి, ఎల్లమందల వీణ, తోట లలిత శారద, సామల మాధవి, సిలివేరి అనిత, సందబిందు, చీమల సుజాత,పోబోలో స్వాతి, వాంగుడోత్ తార, ఇల్లందు మండల సుభాష్ నగర్ మాజీ సర్పంచ్ వల్లాల మంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.