Headlines in Telugu:
-
కాంగ్రెస్ పార్టీ ఆదరణతో అసహనంలో బిఆర్ఎస్ నేతలు
-
ప్రజల ఆదరణతో విసుగుతో విమర్శలు చేస్తున్న బిఆర్ఎస్
-
రైతుల సమస్యలపై కాంగ్రెస్కు ప్రజల మద్దతు
-
బిఆర్ఎస్ నాయకుల విమర్శలపై కాంగ్రెస్ నేతల స్పందన
*కాంగ్రెస్ పార్టీ కి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు*
*కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపిటిసి సంజీవరెడ్డి గూడెపు సారంగపాణి వంగ రామకృష్ణ*
*ఇల్లందకుంట నవంబర్ 6 ప్రశ్న ఆయుధం::-*
కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై హద్దు మీరిన విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి గూడెపు సారంగపాణి వంగ రామకృష్ణ బిఆర్ఎస్ నాయకులపై విరుచుకుపడ్డారు బుధవారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపిటిసి ఎక్కెటి సంజీవరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ పథకాల అమలు తీరుకు వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని రైతు పక్షపాతి అంటే కాంగ్రెస్ పార్టీ అని నాటి రాజశేఖర్ నుండి నేటి రేవంత్ రెడ్డి వరకు రైతాంగ సమస్యలపై అవగాహన కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రతి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆయా సెంటర్ యొక్క అధికారులు సిబ్బంది రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగిందని కొన్ని సెంటర్లలో సిబ్బంది కొరతతో జాప్యం జరిగేడం జరిగిందని అన్ని కొనుగోలు కేంద్రాలకు తక్షణమే కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించడం జరిగిందని మిల్లర్లు రైతులకు ఇబ్బంది కలిగించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోబడతాయని ముఖ్యమంత్రి జిల్లా మంత్రి వారికి సూచనలు ఇచ్చారని ప్రతి సెంటర్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముందు ఉండి కొనుగోలు సక్రమంగా జరిగేటట్లు చూస్తారని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెపు సారంగపాణి మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అనాడు రైతులకు రుణమాఫీ చేయలేనివారు ఈరోజు రైతుల గురించి మొసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటు అని బడుగు బలహీన వర్గాలతో పాటు సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీలు కచ్చితంగా ప్రతి ఇంటికి చేరుతాయని బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుందని భయంతో కావాలనే ప్రభుత్వం వడ్లు కొనడం లేదని రైతులను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు పద్ధతి మార్చుకోకపోతే రానున్న రోజులలో మిమ్మల్ని రైతులు తన్ని తరిమి రోజు వస్తుందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వంగ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అమలు చేసేపథకం సమగ్ర కులగణన తో 6 గ్యారంటీలు ప్రతి అర్హునికి అందించేలా మా కాంగ్రెస్ నాయకులం అందరం కంకణబద్ధులమై చేరవేసేందుకు ముందుంటామని తెలియజేస్తూ మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి పైన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ పైన కాంగ్రెస్ నాయకుల పైన అచ్చోసిన ఆంబోతులా వ్యవహరిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు వ్యవహార శైలి మార్చుకోకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు బిఆర్ఎస్ బిజెపి నాయకులు పనికిమాలిన విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు రైతులకు మేలు చేయాలని ఉంటే రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుమల్ల రామకృష్ణ, పెద్ది కుమార్ ఉప్పుల ఆయిల్ రెడ్డి ఉడుత రత్నాకర్ బొమ్మ శ్రీనివాస్ బండి మల్లయ్య రాజబాబు లింగయ్య రమేష్ దిలీప్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు