కాంగ్రెస్ ను తిట్టడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుంది..

కాంగ్రెస్ ను తిట్టడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుంది..

-పాలనను విస్మరించి… పదేండ్లు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని లూటీ చేసింది

-ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి

కామారెడ్డి టౌన్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 20:

కామారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎక్సైజ్ , పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే ఇవాళ మేము ఏం పని చేయాల్సి వచ్చేది కాదన్నారు. పదేళ్లు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీకే దక్కుతుందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో మరో నాలుగు లక్షల మందికి దీపావళి తర్వాత రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా విషయంలో విధి విధానాలు రూపకల్పన జరుగుతుందని అందుకే కొంత ఆలస్యం జరుగుతుందని చెప్పారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లూటీని గ్రాడ్యుయేట్లు గమనించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now