*అఖిలభారత కిసాన్ సభ జాతీయ కమిటీకి ఎన్నికైన బుడితి అప్పలనాయుడు*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 17( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు
అఖిలభారత కిసాన్ సభ 30వ జాతీయ మహాసభలో జాతీయ ( సమితి)కౌన్సిల్స్ కు ఎన్నికైన బుడితి అప్పల నాయుడు
తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో ఈనెల15,16,17 తేదీలలో అఖిలభారత కిసాన్ సభ 30వ జాతీయ మహాసభలు అహ్లాద కరమైన వాతావరణంలో జరిగాయి.
ఉద్యమ అనుభవాలను నెమరు వేసుకుని రైతంగం,వ్యవసాయం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను మరియు పాలక బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ పాలన అంతా బహుళ జాతి సంస్థలకు ఆదాని,అంబానీలకు ప్రభుత్వ రంగ సంస్థలను దారాదత్తం చేస్తు రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిన నేపథ్యంలో
కరోనా కాస్ట కాలంలో,ఎముకలు కొరికే చలిలో ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఢిల్లీ నడిబొడ్డున 13 నెలల కాలం పాటు లక్షలాది మంది రైతాంగంతో చేసిన వీరోచిత రైతాంగ ఉద్యమ చరిత్ర కలిగిన అఖిల భారత కిసాన్ సభ 30వ జాతీయ మహాసభకు దేశ నలుమూలల నుండి హాజరైన ప్రతినిధులు115 మందితో నూతన జాతీయ సమితిని ఎన్నుకోవడం జరిగింది.
అఖిల భారత కిసాన్ జాతీయ సమితికి బుడితి అప్పలనాయుడును ఎన్నుకోవడం జరిగింది.
బుడితి అప్పలనాయుడు ఎన్నికను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉత్తరాంధ్ర జిల్లా సమితులు హర్షాన్ని వ్యక్తం చేశాయి. హర్ష వ్యక్తం చేసిన వారిలో నారు జనార్దనరావు(జిల్లా అధ్యక్షులు) విజయనగరం,పార్వతీపురం జిల్లా గౌరవ అధ్యక్షులు గురుబిల్లి అప్పలనాయుడు,చందక కేశవరావు (జిల్లాఉపాధ్యక్షులు), బొత్స గౌరు నాయుడు (జిల్లా కోశాధికార), కిమిడి రామ్మూర్తి నాయుడు(జిల్లా అధ్యక్షులు) కౌలు రైతుల సంఘం, వండాన కూర్మా రావు, కనపాక చౌదరి నాయుడు, మామిడి వెంకట సూర్యనారాయణ, మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు అభిమానులు అభినందనలు తెలిపారు.