జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపినాథ్ గెలుపు కోసం ప్రచార వేగం
షేక్పేట డివిజన్ బూత్ల వారీగా నేతల కసరత్తు – మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ గెలుపు కోసం షేక్పేట డివిజన్లో చురుకైన ప్రచారం
బూత్ వారీగా స్థానిక నాయకులు, మహిళా కార్యకర్తల సమన్వయం
మణికొండ మున్సిపాలిటీ నేతల విస్తృత భాగస్వామ్యం
ప్రజల మద్దతు బలంగా ఉందని పార్టీ అంచనా
ప్రచార బాధ్యతలను సమన్వయం చేస్తున్న అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ
హైదరాబాద్, అక్టోబర్ 22 (ప్రశ్న ఆయుధం):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ విజయం కోసం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. షేక్పేట డివిజన్లో బూత్ వారీగా సమావేశాలు, ఇంటింటి ప్రచార కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
బూత్ నంబర్ 24లో స్థానిక నాయకులు జిషాన్, జమీల్, రమేష్, సంపత్, శ్రీకాంత్, అలాగే మణికొండ మున్సిపాలిటీకి చెందిన నాయకులు సంగం శ్రీకాంత్, భాను చందర్, అశోక్ తిరుపతి, బిందు, అనూష, అంజలి పాల్గొన్నారు.
బూత్ 26లో ఆరీఫ్ మొహమ్మద్, సుమనళిని, రేఖ, దేవి, ప్రీయ,
బూత్ 29లో రాములు, కృష్ణా, యాదగిరి,
బూత్ 30లో ఆర్. పరమేశ్వర్, జె. అశోక్ కుమార్, మూర్తి, యాదగిరి, బొడ్డు శ్రీధర్ తదితరులు పాల్గొని గెలుపు కోసం ఓటర్లను సంప్రదించారు.
ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు కుంభగల్ల ధనరాజ్, అందే లక్ష్మణ్ రావు, గోరుకంటి విఠల్, వెంకటేశ్, శ్రీనివాస్ పాల్గొని అభ్యర్థి విజయానికి ఐకమత్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రచార కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న మణికొండ బీఆర్ఎస్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ మాట్లాడుతూ, “ప్రజల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై విపరీతమైన మద్దతు ఉంది. అభివృద్ధి పథం కొనసాగేందుకు మాగంటి సునీతా గోపినాథ్ విజయం అవసరం,” అన్నారు.
“జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధిని ఎంచుకుంటారని విశ్వాసం,” – సీతారాం ధూళిపాళ