Site icon PRASHNA AYUDHAM

సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు

IMG 20250515 WA03301

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 14 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
సోమవారం ఈనెల 16 సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాతకాలికంగా నిలిపివేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ప్రకటన ద్వారా వెల్లడించారు. అదేవిధంగా ఈనెల 16-2025 రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రైతులతో రాష్ట్రవ్యాప్తంగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలో రైతులు పాల్గొననున్నారు.జిల్లా అధికారులందరూ ఇట్టి కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నందున సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి రద్దు చేయడం జరిగిందని తెలిపారు. కావున ప్రజలు గమనించి దరఖాస్తులు సమర్పించడానికి ఐ డి ఓ సి కార్యాలయమునకు రావద్దని కలెక్టర్ సూచించారు.

Exit mobile version