Site icon PRASHNA AYUDHAM

యుద్ధం వేళ… పరీక్షలు రద్దు?

IMG 20250509 WA1150

*యుద్ధం వేళ… పరీక్షలు రద్దు?*

*హైదరాబాద్:మే 09*

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం కొనసాగు తోంది. పాకిస్తాన్‌తో బోర్డర్ కలిగిన రాష్ట్రాలపై పాక్ సైన్యం డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడికి పాల్పడింది. కానీ భారత డిఫెన్స్ సిస్టం వాటిని ఎదుర్కొంది.

అనంతరం పాకిస్తాన్‌పై ఎదురుదాడి చేసి చుక్కలు చూపిస్తుంది. కాగా ఈ పరిస్థితులు నేపథ్యంలో దేశవ్యాప్తంగా మే 9 నుండి మే 14, వరకు జరగాల్సిన చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలను రద్దు చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్ట్స్ ఆఫ్ ఇండియా (ICAI) రద్దు చేసినట్లు ప్రకటించింది.

అలాగే ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని ఐసీఏఐ ప్రకటించింది.

Exit mobile version