
ఆంధ్రప్రదేశ్లో సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ముమ్మరం చేసింది. మార్చిలో పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.



















