*ములుగు జిల్లాలో సిడిపిఓ, ధనలక్ష్మి ఆత్మహత్యయత్నం*
ములుగు జిల్లా: ఫిబ్రవరి 04
ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో సిడిపిఓగా విధులు నిర్వహి స్తున్న ధనలక్ష్మి ఈరోజు ఉదయం కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకుంది,
అంగనవాడి టీచర్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుం దని, కావాలని అంగన్వాడి టీచర్లు తనపై జిల్లా కలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇవ్వడంతో అధికారులు తనను సస్పెండ్ చేశారని,
దీంతో మనస్థాపానికి గురైన తాను ఆత్మహత్య ప్రయ త్నం చేసుకున్నట్టు తెలు స్తుంది,ఆమెను హుటా హుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు.
సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియవలసి ఉంది