హన్మకొండలో ఆగష్టు 31న గద్దర్ ప్రథమ వర్థంతిని జయప్రదం చేయండి.
ప్రజా వాగ్గేయకారుడు గద్దరన్న మరణించి యేడాది గడిచింది. వరంగల్ జిల్లాతో గద్దరన్నకు విడదీయలేని అనుబంధం ఉంది. గద్దరన్న ప్రథమ వర్థంతిని ఆగష్టు 31 నాడు హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో ఉదయం 10-30 నుండి మధ్యాహ్నం 3-00 గంటల వరకు జూన్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుమ్మడి సూర్యకిరణ్ గారు, విమలక్కగారు, ప్రొ.కూరపాటి వెంకటనారాయణ గారు, సిఎల్ యాదగిరి గారు, డా.పృథ్వీరాజ్ యాదవ్ గారు, డా.జిలుకర శ్రీనివాస్ గారు, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, ప్రధాన కార్యదర్శి సదయ్య గారు, సాయిని నరేందర్ గారు, సోమ రామ్మూర్తి గారు, వనజక్క గారు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము.