వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

*వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు*

*స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ దంపతులు*

*జమ్మికుంట జనవరి 10 ప్రశ్న ఆయుధం*

IMG 20250110 WA0129

పట్టణంతోపాటు ఉమ్మడి జమ్మికుంట మండలంలోని వైష్ణవ ఆలయాలలోముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పురస్కరించుకొని శుక్రవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కొత్తపల్లిలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు,రాధిక దంపతులు సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కొత్తపెళ్లి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు బొద్దుల రవీందర్ ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్మన్ దంపతులు శ్రీ భక్తాంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఆలయ అర్చకులు శేషం వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు పూర్వం జమ్మికుంట లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో డింగరి హరికృష్ణ , వేణుగోపాలచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు . వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ముక్కా జితేందర్ గుప్తా ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు .ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు బొద్దుల రవీందర్, ఆలయ అర్చకులుశేషం వరప్రసాదాచార్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now