మెదక్/సిద్దిపేట ఆగస్టు 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్.పి.హెచ్.ఎస్) లో 22 మంది విద్యార్థులు ఐఐఐటీలో ఉత్తీర్ణులై మండలానికి, సిద్దిపేటకు గర్వకారణం అని ఫస్ట్ ఫార్మర్స్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు గాధగోని చక్రధర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషికి తనవంతు ప్రోత్సాహం అందించాలని చక్రధర్ గౌడ్ ఒక్కో విద్యార్థికి 5,000 రూపాయలు అందజేశారు. అనంతరం చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని, దేశం గర్వపడే విధంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
*22 మంది విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించిన చక్రధర్ గౌడ్*
Oplus_0