*భక్తితో వడ్లను ఓలిచి రామకోటి రామరాజుకు అందజేశారు*
*ఎన్ని జన్మల పుణ్యమో అని ఆనందాన్ని వ్యక్తం చేసిన భక్తులు*
మెదక్/గజ్వేల్, మార్చి 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): శ్రీరామనవమి నాడు కన్నుల పండుగగా జరిగే భద్రాచల రామయ్య కళ్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుండి 250కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్ప దీక్షతో గ్రామ, గ్రామాన శ్రీకారం చుట్టింది గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ. అందులో భాగంగా సోమవారం వర్గల్ మండల్ చాంద్ ఖాన్ మక్త గ్రామంలో భక్తులు గోటితో వడ్లను ఓలిచి సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజుకు అందజేశారు. వారిచే రామనామ స్మరణ చేయించి రామనామం గురించి, భద్రాచల గోటి తలంబ్రాల యొక్క పవిత్రత గురించి అందరికీ తెలియజేశారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ.. రెండోసారి మా గ్రామానికి తలంబ్రాలు రావడం ఆనందంగా ఉందని ప్రతి సంవత్సరం ఇలాంటి అవకాశం కల్పించాలని భక్తులు రామకోటి రామరాజును కోరారు. మేము భద్రాచలం వెళ్లలేక పోయిన కూడా మేము చేతులతో ఓలిచిన ఈ గోటి తలంబ్రాలు వెళ్లడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.