కిమ్స్ ఆసుపత్రిలో మహేష్ యాదవ్‌ను పరామర్శించిన చంద్ర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్

*కిమ్స్ ఆసుపత్రిలో మహేష్ యాదవ్‌ను పరామర్శించిన చంద్ర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 22

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగారం మాజీ వార్డు సభ్యులు మహేష్ యాదవ్ను ఆదివారం నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్ర రెడ్డి మరియు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు.

మహేష్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న వారు, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఇతర బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. మహేష్ యాదవ్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment