ఎమ్మెల్యేల పనితీరు మారాలి: చంద్రబాబు

*ఎమ్మెల్యేల పనితీరు మారాలి: చంద్రబాబు*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 29( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు

తాను క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరీజు వేస్తున్నట్లు వెల్లడించారు. *ఎమ్మెల్యేలతో నిన్నటి నుంచి రోజుకు నలుగురిని పిలిచి మాట్లాడుతున్నానని ఇంక కొంతమంది తమ పనితీరు మారాల్సిందేనని తేల్చిచెప్పారు.* పనితీరు మార్చుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇక అంతే సంగతులంటూ హెచ్చరించారు. ఎంత పని చేశామనే అంశంతో పాటు ఎలా చేస్తున్నామనేది కూడా కీలకమని స్పష్టం చేశారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. వారసులకు హ్యండ్ హోల్టింగ్ ఇస్తాం కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ల మీదే ఉంటుందని వివరించారు..

Join WhatsApp

Join Now

Leave a Comment