చందూర్ ఎంపీడీఓ కార్యాలయానికి తాళం..
నిజామాబాద్ జిల్లా చందూర్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 17:
చందూర్ ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన యజమాని నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి గురువారం ఇంటి యజమాని సూర్య నారాయణ తాళం వేయడం జరిగింది. 26 నెలలుగా తనకు అద్దె చెల్లించకపోవడంతో కార్యాలయానికి తాళం వేసినట్టు అధికారులు తెలిపారు. అద్దె భవనానికి యజమాని తాళం వేయడంతో కార్యాలయం బయట కూర్చున్న అధికారులు, కార్యాలయానికి పలు పనులపై వచ్చిన ప్రజలు ఇబందులు పడ్డారు.