Site icon PRASHNA AYUDHAM

భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నామ మాత్రమేనా…?

IMG 20241119 WA0192

భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద నామమాత్రపు తనిఖీలకే పరిమితమైన మైనింగ్ మరియు టిఎస్ఎండిసి అధికారులు

చర్ల నుంచి అధిక లోడులతో, తూకం వేయకుండా చెక్ పోస్ట్ దాటుతున్న ఇసుక లారీలు..

అసలు తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక క్వారీ ఉన్న దగ్గరే నిబంధన ప్రకారం వే బ్రిడ్జి ఉండాలి, అక్కడ లేకపోగా భద్రాచలంలో కూడా తూకం వేయటం లేదు ఏమిటో అందులో అంతర్యం?

ఒక్కొక్క లారీలు పరిమితికి మించి పది నుంచి 15 టన్నుల అధిక ఇసుకను తోలుతున్న వైనం.

చర్ల ఇసుక ర్యాంపులలో లోడింగ్ చార్జింగ్ పేరుతో 2000 రూపాయలు, ఎక్కువ టన్నులకు మరొక 2000 వసూలు చేస్తున్న రైసింగ్ కాంట్రాక్టర్లు?

చర్ల ఇసుక క్వారీలలో జరిగే ప్రకృతి సంపద దోపిడీపై , పర్యావరణ పొల్యూషన్ పై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుని కొంతమంది ప్రకృతి పరిరక్షకులు, విద్యావంతులు, జర్నలిస్టులు ఆశ్రయించబోతున్నారని సమాచారం.

Exit mobile version