Site icon PRASHNA AYUDHAM

చెవిరెడ్డి అరెస్ట్‌ అక్రమం – ప్రజాస్వామ్యంపై దాడి: ఎంపీ గురుమూర్తి

Screenshot 2025 06 18 12 16 32 528 edit com.whatsapp

*చెవిరెడ్డి అరెస్ట్‌ అక్రమం – ప్రజాస్వామ్యంపై దాడి: ఎంపీ గురుమూర్తి*

వైస్సార్కాం గ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అక్రమమని, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగమని తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది మొదలు ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేసి వేదింపులకి గురిచేస్తుందని, ఇధి ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వ కుట్రలలో బాగంగానే తిరుపతి జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్ధన్ రెడ్డిలను అరెస్టు చేయడం జరిగింది అని చెప్పారు. ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యల వలన తాము కాని, తమ కార్యక్రతలు కాని భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

Exit mobile version