రైతులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ముఖాముఖీ..జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల

*జూన్ 23, సోమవారం* 

*మహబూబాబాద్ జిల్లా*

*రైతులతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ముఖాముఖీ కార్యక్రమం*

*జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల*

వానాకాలం 2025 కి సంబంధించి పంట సాగు కై పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం ద్వారా నిధులను విజయవంతంగా రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా రేపు అనగా (24, జూన్) సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నుండి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు,

ఈ కార్యక్రమాన్ని జిల్లాలోనీ (49) రైతు వేదికలలో పండుగ వాతావరణం లో నిర్వహించేందుకు ప్రతి రైతు వేదిక వద్ద అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు డిఏఓ పేర్కొన్నారు,

ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ గా మండల స్థాయి అధికారులు నియమించి, రైతు వేదికల వద్దకు ప్రజాప్రతినిధులు రైతులు చేరుకునేలా ఆదేశాలు జారీ చేసినట్లు, జిల్లాలో 205789 మంది రైతులకు రైతు భరోసా రూపాయలు 2434570876 డబ్బులు వారి వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల తెలిపారు.

కావున జిల్లాలోని రైతులందరూ సంబంధిత రైతు వేదికలలో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆమె కోరారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment