దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారు .

వేములవాడ ఆలయ గెస్ట్ హౌజ్ లో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లు రి లక్ష్మణ్ కుమార్ తో కలిసి మీడియా సమావేశంలో

*

పొన్నం ప్రభాకర్,రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ*

అందరికీ భోగి మకర సంక్రాంతి ,కనుమ శుభాకాంక్షలు

ఆరుద్ర నక్షత్రం సోమవారి పౌర్ణమి మహా పర్వదినాన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది..

ఈ సీజన్ లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి, ఆయు ఆరోగ్యాలతో పాడి పంటలతో, ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని మొక్కుకున్న .

రైతంగా బాగుంటేనే అందరూ బాగుంటారు..

దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారు .

ఆధి శ్రీనివాస్ తో పాటు నాది ,ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నిత్య అన్నదాన సత్రం ఏర్పాటు చేయడం .

ముఖ్యమంత్రి కి మా విజ్ఞప్తి మేరకు అన్నదాన సత్రం భవన నిర్మాణానికి 35 కోట్లు మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేశారు.

35 కోట్లతో అన్నదాన సత్రం భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ జరుగుతుంది..

అన్నదాన సత్రం నిరంతరం జరగడానికి ట్రస్ట్ లో ఇప్పటికే 20 కోట్లు ఉన్నాయి..

దానిని వంద కొట్లీ చేసే బాధ్యత జిల్లా ప్రజా ప్రతినిధులది ఈ ప్రాంత ప్రజలది..

*అన్నదాన సత్రం కోసం మా కుటుంబ సభ్యులు ,మా అన్నదమ్ములు కలిసి 40 లక్షలు ఆ స్వామి వారి నిత్యాన్నదాన సత్రం కు విరాళం ఇస్తున్నాం*

రాజరాజశ్వర స్వామి భక్తులుగా డోనర్స్ ఉంటే విరాళాలు ఇవ్వాలని కోరుతున్నా..

దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ లో రశీదులు తీసుకొని విరాళాలు ఇవ్వండి

స్థానిక శాసన సభ్యులు, ఈవో నీ కలిసి విరాళాలు ఇవ్వచ్చు..

ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం తో నిత్యాన్నదాన సత్రం విజయవంతం కావాలి

మీరు అంత సహకరించండి.. వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్ట్ కి సంబంధించి విరాళాలు ఏవి ఇచ్చిన సరే.

రైతులు బియ్యం ,కూరగాయలు కూడా ఇవ్వచ్చు..

అన్ని పార్టీల వాళ్లు ఎవరెవరు ఆర్థికంగా ఉన్న ఆ దేవాలయానికి వెచ్చిస్తే సంతోషం..

మేము ఇద్దరం కలిసి హైదరాబాద్ లో డోనర్స్ ను కలుస్తాం..

వేములవాడ దర్శనంలో కోడె టికెట్ ,అభిషేకం టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నాం..

తిరుపతి లాగ అందరికీ ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు కానీ టికెట్ తీసుకోండి

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలని వీఐపీ ప్రోటోకాల్ దర్శనం చేసుకునే వారు టికెట్ తీసుకోవాలి..

బ్రేక్ దర్శనం ఆలస్యం లేకుండా త్వరత్వరగా జరుగుతుంది.

మహా శివరాత్రి కి సంబంధించి ఇప్పటికే శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆధి శ్రీనివాస్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు..

శ్రీశైలం లో ఉన్న మాదిరి మ్యూజికల్ ఫౌంటెన్ వేములవాడ లో లార్డ్ శివ ఉండేలా చేస్తున్నాం..

ధర్మపురి నుండి ఏసీ బస్సు స్టార్ట్ అయింది.

వేములవాడ నుండి కూడా ఏసీ బస్సు ప్రారంభిస్తాం .

వేములవాడ బస్ స్టాప్ ను అభివృద్ది చేస్తాం..

Join WhatsApp

Join Now