త్వరలో 35 వేల ఉద్యోగాలు భర్తీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యూపీయస్సీ మెయిన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తెలంగాణ యువతకు రాజీవ్ గాంధీ అభయ్ హస్తం పధకం కింద ఒక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆయన సాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. త్వరలో మరో 35 వేల ఉద్యోగాల నియామకానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం నుంచి అధిక సంఖ్య లో అభ్యర్థులు సివిల్స్ కి ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు..