అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

IMG 20240808 WA0014

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పేరొందిన పలు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. తాజాగా.. దిగ్గజ ఫార్మా కంపెనీ అయిన వివింట్ ఫార్మా తెలంగాణలో తమ సంస్థ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివింట్ కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో వివింట్ కంపెనీ ఆర్ అండ్ డీ కేంద్రం ఉంది. సుమారు రూ. 70 కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా హైదరాబాద్‌లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది.

Join WhatsApp

Join Now