Site icon PRASHNA AYUDHAM

పిల్లల సంరక్షణ మన అందరి భాద్యత జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

IMG 20241206 WA0390

జిల్లా బాలల సంరక్షణ యూనిట్ సమావేశం.

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 6 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
జిల్లాలో బాలల సంరక్షణ యూనిట్ (డి సి పి యు) సమావేశాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా ఉండాలని, మారుమూల ప్రాంతాల ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కోళ్ల ఫామ్స్,ఇటుక బట్టీలు మరియు షాపింగ్ మాల్ లో తదితర అన్నిచోట్ల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. మణుగూరులో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ గృహం జిల్లా కేంద్రం కి దూరంగా ఉండటం వలన పర్యవేక్షించడానికి అనువుగా లేదని జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలో బాలల సంరక్షణ గృహం ఏర్పాటుకు ప్రణాళికల రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మణుగూరు లో ఉన్న బాలల సంరక్షణ గృహమును సిడిపిఓ కార్యాలయంగా మార్చాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలోని బాలల సంరక్షణ గృహంలో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని, సంరక్షణ గృహాలలో నెలకొన్న సమస్యలు మరియు వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై వారంలోగా సమగ్ర నివేదిక అందించాలని వెంటనే సమస్యలు పరిష్కరిస్తాము అన్నారు.సంరక్షణ గృహాలలో పిల్లల ఆరోగ్య పై శ్రద్ధ చూపించాలని, ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్యలు పిల్లలకు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకు నెలకి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థినిల హాజరు పర్యవేక్షించాలని ఎవరైతే పది రోజుల కంటే ఎక్కువ సెలవులు ఉన్నాయో అట్టి విద్యార్థినిలను ఆరోగ్య సమస్య లేదా వివాహం ఏమైనా జరిగిందా అని విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పిల్లల సంరక్షణ చేపట్టాలని, పిల్లల సంరక్షణ మన అందరి బాధ్యత అని ఆయన అన్నారు.జిల్లాలో ఎన్ని పోక్సో కేసులు నమోదయ్యాయి, జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలలో నమోదు అయిన కేసుల పూర్తి వివరాలను వారం రోజులలోగా నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నివేదికల ద్వారా ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ పోక్సో కేసు నమోదు అయ్యాయో ఆ ప్రాంతంలో అవగాహన సదస్సులు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు.చైల్డ్ హెల్ప్ లైన్ కు వచ్చే ఫిర్యాదుల ను జిల్లా, మండల మరియు గ్రామ స్థాయిలో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు ప్రతి నెల మొదటి వారంలో జిల్లాలోని అన్ని పాఠశాలలు, హాస్టల్స్ ల హెడ్మాస్టర్లు మరియు వార్డెన్ లకు ఫోన్ చేసి పాఠశాలలో ఎవరైనా లైంగిక వేధింపులకు గురి అయ్యారా, ఉపాధ్యాయులు పిల్లలను కొట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారా అని అడిగి,విద్యార్థుల పూర్తి బాధ్యత హెడ్మాస్టర్ లది మరియు హాస్టల్ వార్డెన్ లదే అని స్పష్టం చేయాలన్నారు. ఎవరైనా అటువంటి చర్యలకు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, సిపిఓ సంజీవరావు, మహిళా శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లెనీనా,బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version