హెచ్ఎం మద్దెల శివకుమార్ ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్ నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలు
మరియు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం జరిగింది.నేటి బాలలే రేపటి భావి భారత పౌరుల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ అన్నారు.
స్వాతంత్రానంతరం భారత దేశ ప్రథమ ప్రధానిగా మహోన్నతమైన పదవీ బాధ్యతలు నిర్వహించిన
పండిట్ జవహర్లాల్ నెహ్రూ కి చిన్న పిల్లలన్న గులాబీ పువ్వులన్నా చాలా ఇష్టమని, చిన్నపిల్లలు నిష్కల్మషమైన సెలయేరు లాంటివారని కల్లాకపటం తెలియని వారిని,వారు దేవతలతో సమానమని భావించిన, నెహ్రూ జయంతి రోజున బాలల దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమని, అందుకే నెహ్రూ ని పిల్లలంతా చాచా నెహ్రూ అని ప్రేమతో పిలుస్తారని,
స్వాతంత్రోద్యమంలోనూ స్వతంత్ర భారతంలోనూ నెహ్రూ అందించిన సేవలు వారి కుటుంబం అందించిన త్యాగాలు వెలకట్టలేనివని, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ తన అపరిమిత మేదస్సుతో రచించిన రాజ్యాంగాన్ని అమలు పరచడంలో నెహ్రూ ఎంతో కృషి చేశారని,నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అన్న నెహ్రూ ఆశయాన్ని సాకారం చేయడానికి
విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉత్తమ పౌరులుగా ఎదిగి సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని పాటుపడాలని.నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు , కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.
నవంబర్ 14నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న బాలల దినోత్సవాన్ని సుజాతనగర్ మండలంలోని మండల పరిషత్ పాఠశాల నిమ్మలగూడెంలో ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నేతృత్వంలోఘనంగా నిర్వహించారు.తొలుత జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.విద్యార్థుల ప్రతిభ పాటవాలను ప్రదర్శించే రీతిగా కార్యక్రమాన్ని నడిపించారు.అనంతరం ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విజేతలకు, ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ తన సొంత సౌజన్యంతో రూ,,2 వేల విలువైన బహుమతులను అతిధుల , తల్లిదండ్రుల , గ్రామ పెద్దల చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు
అనంతరం ప్రతి నెల నిర్వహించే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం, అధికారుల సూచన మేరకు ఈ రోజే నిర్వహించార.
ఆచార్య డాక్టర్ మద్దెల, గౌరవ అతిథిగా హాజరైన పంచాయతీ సెక్రెటర్ కృష్ణకుమారి, సహా ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్ విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు క్రమంగా పాఠశాలకు వచ్చి క్రమశిక్షణతో కష్టపడి చదవాలని, తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద పిల్లలను క్రమశిక్షణగా పెంచాలని, ఏ రోజు చెప్పబడిన పాఠాలు ఆరోజున చదివించడం వ్రాయించడం నేర్పించాలని, విద్యార్థుల సామర్ధ్యాలకు సంబంధించిన ప్రగతిని తల్లిదండ్రులకు నివేదించారు.
అనంతరం ప్రభుత్వం వారు ఈ సంవత్సరం నుండి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా అందిస్తున్న ఉచిత నోటు పుస్తకాలను ఈ సందర్భంగా విద్యార్థులకు పంపిణీ చేశారు
అంతేగాక స్వీట్లు బిస్కెట్లు పండ్లు అందరికీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఆలపించిన, విద్యా గీతాలు మరియు చిన్నపిల్లల గీతాలు అందరిని అలరించాయి
అధ్యంతం అందరినీ అలరించిన ఈ ఆత్మీయ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్,నిమ్మలగూడెం పంచాయతీ సెక్రెటరీ కృష్ణకుమారి, సహ ఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్, ఆదర్శ పాఠశాల వైస్ చైర్మన్ బండి రమేష్, డాక్టర్ శ్రీనివాస్ ,అంగన్వాడి టీచర్ ప్రమీల, ఆయా పద్మ, గ్రామ పెద్దలు బండి వెంకటేశ్వర్లు ఫకీరయ్య, బడుగు నాగేశ్వరరావు, లావణ్య రజిత తుమ్పురు నరేష్, తల్లిదండ్రులు గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నరు.