*పిల్లల ప్రగతి బాటకే* …!
– *ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు హర్షనీయం*
– *రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం*
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య
పిల్లల విద్యాభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ దోహదపడతాయని, తద్వారా వారికి బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని, ఈ స్కూల్స్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవటం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య వ్యాఖ్యానించారు.
హైదరాబాదులో ఆదివారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కర్టన్ రైజ్ ప్రోగ్రాం ఆవిష్కరణలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క తో కలిసి శ్రీ పొదెం వీరయ్య పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో నిర్మించేందుకు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పూనుకోవటం ముదావహం అన్నారు.
విశాలమైన స్థలంలో, అధనాతన భవన సముదాయంలో ఇంగ్లీష్ మీడియంలో ఓకే వేదికగా 12వ తరగతి వరకు విద్యా బోధన జరిగే అవకాశం ఉండటంతో, ఇటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేధావి వర్గాన్ని తయారు చేస్తాయని పేర్కొన్నారు. తద్వారా పిల్లలు ఉపాధి, ఉద్యోగ రంగాల్లో స్థిరపడి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తారన్నారు.
ఇంత చక్కని ఆలోచన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుండటం పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరమని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనని ‘పొదెం’ వ్యాఖ్యానించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందటమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులేస్తోందని తెలిపారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలు నిరుద్యోగులకు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు