Site icon PRASHNA AYUDHAM

జేట్టి కుసుమ కుమార్, ఎంపీ సురేష్ శెట్కర్ లను కలిసిన చిన్నా ముదిరాజ్

IMG 20250618 181259

Oplus_0

IMG 20250618 181322
సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాద్ లో మాజీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జేట్టి కుసుమ కుమార్, జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడు సురేష్ శెట్కర్ లను టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చిన్నా ముదిరాజ్ మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారితో రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, స్థానిక సమస్యల పరిష్కారం, మరియు భవిష్యత్తు కార్యాచరణపై వారు సన్నిహితంగా చర్చించినట్లు తెలిసింది. పార్టీ ఐక్యత, పునర్నిర్మాణం, మరియు ప్రాంతీయ అభివృద్ధిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గౌడ్, ఓబీసీ జిల్లా చైర్మన్ మావిన్ గౌడ్, నాయకులు రుద్రారం సాయి, వర్మ, చింటూ విజయ్, శ్రీనివాస్, సంతోష్, దేవ, మౌలి, నవీన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version