*కొత్తపేటలో సీసీ కెమెరాలు ప్రారంభించిన సీఐ రాంనర్సింహారెడ్డి*
*Mar 01, 2025*
ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలోని మార్కండేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శనివారం ధర్మపురి సీఐ వెలపాటి రామ నరసింహారెడ్డి ప్రారంభించారు. ఇదేవిధంగా గ్రామంలో అన్ని దేవాలయాల్లో గ్రామ మూలమలుపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ హితవు పలికారు. సీఐ వెంట వెల్గటూరు ఎస్సై రాపల్లి ఉమా సాగర్, కొత్తపేట గ్రామ పద్మశాలి సంఘం నేతలు, సామాజిక కార్యకర్త జీరెడ్డి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.