జాతీయ సేవా ప్రత్యేక శిబిరం లో పరిశుభ్రత ర్యాలీ
పరిశుభ్రతతోనే ప్రగతి
శాస్త్రీయ పద్ధతిలో విత్తన ఉత్పత్తితో రైతు ఆదాయం
ప్రశ్నయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి నవంబర్ 5
స్థానిక వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట ఆధ్వర్యంలో మల్కారం గ్రామంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మల్కారం మరియు దమ్మపేట గ్రామాలలో విద్యార్థులు స్వచ్ఛతపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం దమ్మపేట కూడలిలో మానవహారం నిర్వహించారు. తరువాత మాల్కరం గ్రామంలోని రైతు వేదిక పరిసరాలన మరియు ప్రాథమిక పాఠశాల పరిసరాలను వ్యవసాయ కళాశాల విద్యార్థులు శుభ్రపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం రాంప్రసాద్, డాక్టర్ పి. రెడ్డి ప్రియ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తమ పరిసరాలను శుభ్రపరచుకోవటంలో ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలి అన్నారు.
మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో వరి మరియు మొక్కజొన్న పంటల్లో విత్తన ఉత్పత్తిలో పాటించాల్సిన శాస్త్రీయ మెలకువలను గురించి రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.మధుసూదన్ రెడ్డి మొక్కజొన్న లో విత్తన ఉత్పత్తిలో రైతుల తీసుకోవాల్సిన మెలకువలను వివరించారు. అధిక విత్తన దిగుబడి కి చేపట్టాల్సిన చర్యలను గురించి రైతులకు ప్రయోగాత్మకంగా వివరించారు. అనంతరం శాస్త్రవేత్త డాక్టర్ పి. ఝాన్సీ రాణి మాట్లాడుతూ వరి విత్తన ఉత్పత్తి చేపట్టే రైతులు, తీసుకోవలసిన జాగ్రత్తలను సవివరంగా వివరించారు. విత్తనోత్పత్తి చేపట్టటం వల్ల రైతులకు కలిగే లాభాలను గురించి వివరించటం జరిగింది.