దేశంలో 32 ఎయిర్పోర్టులు మూసివేత
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో DGCA కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర, పశ్చిమ భారత్లోని 32 ఎయిర్పోర్టులను ఈనెల 15 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతిపొర, భటిండా, హల్వారా, హిండన్, జమ్మూ, చండీగఢ్, భుజ్, బికనీర్, జామ్నగర్, కండ్లా, కంగ్రా, కిషానఢ్, కులూ మనాలి, జామ్నగర్, జైసల్మేర్, జోధ్పూర్, లూథియానా, రాజ్కోట్, సిమ్లా, శ్రీనగర్ తదితర ఎయిర్పోర్టులను మూసివేసింది.