**పేదలకు వరంలా సీఎం సహాయ నిధి – మేడ్చల్ నియోజకవర్గ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ**
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 26
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఒక వరంలాంటిదని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం మేడ్చల్ నియోజకవర్గంలోని వివిధ మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.
**లబ్ధిదారుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:**
* **రాజేశ్వర్ పులిగిల్ల** – గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ – ₹60,000/-
* **సైనోసి విమల** – కొర్రెముల, ఘట్కేసర్ మండలం – ₹36,000/-
* **బోదాసు స్వరూప** – పోచారం, ఘట్కేసర్ మండలం – ₹37,500/-
* **ఎన్. కుమార్** – కొర్రెముల్, వెంకటాపురం – ₹32,500/-
* **బైరి నచికేత్** – పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ – ₹60,000/-
* **పి. బాలిరెడ్డి** – కీసర – ₹60,000/-
* **కుక్కదువు నర్సింహా** – కీసర – ₹60,000/-
* **నక్క అండాలు** – కీసర ధైర – ₹33,500/-
* **అకిటి సత్తిరెడ్డి** – కీసర – ₹39,000/-
* **రామన్నగారి జయలక్ష్మి** – రైలాపూర్, మేడ్చల్ – ₹60,000/-
* **నడికొప్పు నాగమణి** – మేడ్చల్ – ₹37,500/-
ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, పేద ప్రజలకు వైద్య అవసరాల నిమిత్తం ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉపయోగపడుతోందన్నారు. పేదల భరోసా కోసం ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని తెలిపారు.