Site icon PRASHNA AYUDHAM

రేషన్ కోటా పెంచండి’.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

IMG 20250304 WA0069

*తెలంగాణ : ‘రేషన్ కోటా పెంచండి’.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి*

*Mar 04, 2025*

తెలంగాణ : కొత్త రేషన్ కార్డుల జారీ నేపథ్యంలో అవసరమైన కోటా పెంచాలని CM రేవంత్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్, సీఎం.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. 2014-15కి గాను సేకరించిన ధాన్యం బకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యం బకాయిలు రూ.343.27 కోట్లు విడుదల, CMR డెలివరీ గడువును పొడిగించాలని కోరారు.

Exit mobile version