పర్యటనలో భాగంగా సాయంత్రం చంద్రబాబు కేంద్ర జల్శక్తి శాఖ మంత్రితో సమావేశమయ్యారు.
పోలవరం ప్రాజెక్టుపై వారిరువురు చర్చించినట్లు అధికారులు వెల్లడించారు…
సీఎం చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కేంద్ర మంత్రితో చర్చించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎంపీలు సమావేశంలో పాల్గొన్నారు.