**రైతు భరోసా కోసం చేసిన సేవకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం – మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల నుంచి ఘనంగా నిర్వహణ**
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 26
రైతులకు భరోసా కల్పిస్తూ 9 రోజుల్లోనే రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, దేశంలోనే దార్శనిక పాలనను అందిస్తున్నదని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రైతు భరోసా సంబురాల నేపథ్యంలో, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల, మున్సిపల్, కార్పొరేషన్ కేంద్రాలలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అందులో భాగంగా గురువారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, నాయకులతో కలిసి సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, రైతుల సంక్షేమానికి కృషిచేస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, సీనియర్ నాయకులు రాపోలు రాములు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.