*మహా గణేషుడి నిమజ్జనంలో పాల్గొననున్న సీఎం రేవంత్*
*Sep 17, 2024*
మహా గణేషుడి నిమజ్జనంలో పాల్గొననున్న సీఎం రేవంత్
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం రేవంత్ ట్యాంక్ బండ్ కు చేరుకోనున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ సప్తముఖ వినాయకుడి శోభాయాత్ర ట్యాంక్ బండ్ చేరువగా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. కాగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.