Site icon PRASHNA AYUDHAM

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..?

IMG 20241112 WA0013

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..?

హైదరాబాద్ డెస్క్ నవంబర్ 12

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.ఢిల్లీలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ‘అడ్డా’ ప్రోగ్రాంలో ఆయన పాల్గొంటారని తెలిసింది,
ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆయన బయలు దేరతారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు అడ్డా ప్రోగ్రాంలో ఆయన పాల్గొంటారు.
ఢిల్లీ పర్యటనలో అందు బాటులో ఉన్న కాంగ్రెస్‌ నేతలను రేవంత్‌ రెడ్డి, కలిసే అవకాశం ఉంది. ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల వ్యూహానికి సంబంధించి అడ్డా కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన ఢిల్లీ లోనే బస చేయనున్నారు.
అక్కడి నుంచి బుధవారం ముంబైకి వెళ్తారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని, తిరిగి హైదరాబాద్‌కు చేరుకుం టారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి గడువు తక్కువగా ఉండడంతో ముఖ్యనేతలు అందరూ మహారాష్ట్రానికి వెళ్తున్నారు.

Exit mobile version