తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చాలని సిఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి

ఉద్యమకారుల
Headlines
  1. తెలంగాణ ఉద్యమకారులకు హామీలపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి
  2. ఉద్యమకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
  3. మక్తల్ నుండి ఉస్మానియా వరకు పాదయాత్రకు సిద్ధమైన ఉద్యమకారుల సంఘం
  4. స్థానిక ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతున్న తెలంగాణ ఉద్యమకారులు
  5. కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయాలకు బాధ్యత తీసుకుంటారా? తెలంగాణ ఉద్యమకారుల ప్రశ్న
ఆమరుల బలిదానాల పునాదుల మీద సిద్దించిన తెలంగాణలో గత కేసీఆర్ పాలనలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దాసర్ల శ్రీశైలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం కోరుట్ల పట్టణంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ తో కలిసి శ్రీశైలం మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయ్యాలని, ప్రజాపాలనలో ప్రకటించిన రెండు వందల ఐబై గజాల స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయాలన్నారు. అదే ప్రధాన లక్ష్యంతో గత అక్టోబర్ మాసంలో అదిలాబాద్ నుండి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఉద్యమకారుల సంఘం పాదయాత్ర చేసిందని దానికి ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షులు పేట భాస్కర్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది గుర్తు చేశారు. ఉద్యమకారులకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని లేని పక్షంలో మరోసారి ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి 15 వరకు మక్తల్ నుండి వయా కొడంగల్ ఉస్మానియా యూనివర్సిటీ వరకు పాదయాత్ర కోనసాగిస్తామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తెలంగాణ ఉద్యమకారుల సంఘం పక్షాన పోటీ చేస్తామని దాసర్ల శ్రీ శైలం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నును కాపు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, ఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు షాహేద్ మహ్మద్ షేక్, అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షులు శనిగారపు రాజేష్, నాయకులు పడిగల అజేయ్, గణేష్ ,రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now