నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
ఎడపల్లి నవంబర్ 08:
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదినం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎడపల్లీ మండలం జనకంపేట్ గ్రామంలో ని కాంగ్రెస్ నాయకులు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కేక్ కట్ చేసిన అనంతరం విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు విజయ్ గౌడ్, జహీరుద్దీన్ మడ్లడుతూ సిఏం రేవంత్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుుకోవాలని, ఆయన ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను అని అన్నారు. సిఏం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృధి వల్ల మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాధాకిషన్ గౌడ్, కిషోర్, కార్యకర్తలు పాల్గొన్నారు.