వ్యవసాయం చేసిన సీఎం
ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పుష్కర్సింగ్ ధామి పొలంలోకి దిగి వ్యవసాయం చేశారు.
పగ్గాలు పట్టుకొని ఎడ్లతో భూమిని చదును చేశారు. అనంతరం కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. ‘ఇలా చేయడం ద్వారా నా పాత రోజులు గుర్తొచ్చాయి. రైతులు కేవలం ఆహార ప్రదాతలు మాత్రమే కాదు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక.
సంస్కృతి, సంప్రదాయానికి వాహకాలు’ అని సీఎం పేర్కొన్నారు.