Site icon PRASHNA AYUDHAM

సీఎస్ఆర్ నిధులపై ఎమ్మెల్యేతో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సమీక్ష

IMG 20241120 WA0176

జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సిఎస్ఆర్ నిధులు అందజేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశ్రమల ప్రతినిధులను కోరారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, కోరం కనకయ్యలతో పాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సామాజిక,విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు కేటాయిస్తామన్నారు. ఇక్కడ ఉన్న సంస్థలు జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ ను తమ వంతు బాధ్యతగా రెండు శాతం నిధులను అందజేయాలని ఆయన కోరారు. గతంలో సిఎస్ఆర్ నిధుల కింద జిల్లాలో అన్ని నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులను విజయవంతంగా చేపట్టడం జరిగిందన్నారు. సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. సీఎస్ఆర్ నిధులను స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు అవసరమైన పనులకు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సింగరేణి, కేటీపీఎస్, ఐటిసి,నవభారత్,బీటీపీఎస్ యాజమాన్యాలకు చెందిన ఉన్నతాధికారులు,జీఎం ఇండస్ట్రీస్ తిరుపతయ్య,సీపీఓ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version