Site icon PRASHNA AYUDHAM

పాఠశాల హెచ్ఎంను సస్పెన్షన్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు..

IMG 20251107 135649 1

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పారిశుద్ధ సమస్యపై కలెక్టర్ పి.ప్రావీణ్య, ప్రధానోపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సంగారెడ్డి బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో శానిటేషన్ సమస్య, ఎఫ్ఆర్ఎస్ సిస్టం సరిగా అమలు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పాఠశాలలో మూత్రశాలలు మరుగుదొడ్లను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉండడంతో పాటు పాఠశాలలో శానిటేషన్ సమస్య కలెక్టర్ దృష్టికి రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రోజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని సస్పెన్షన్ చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ను ఆదేశించారు. పాఠశాలలో సానిటేషన్ సిబ్బందిని తొలగించి నూతన శానిటేషన్ సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించారు. ఎఫ్ఆర్ఎస్ సిస్టంపూర్తి స్థాయిలో అమలు అయ్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. రానున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణులు అయ్యేలా ఇప్పటి నుండే ఉపాధ్యాయులు, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుకు ఉపాధ్యాయులు సిబ్బంది కృషి చేయాలని ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.

Exit mobile version