ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ఎర్రపహాడ్‌ హెలిపాడ్ వద్ద ఏర్పాట్లు చూసిన అధికారులు

లింగంపేట్ కుర్దు వంతెన వద్ద వరద ప్రభావం సమీక్ష

బుడిగిడా గ్రామంలో దెబ్బతిన్న వరి పంట పరిశీలన

జి.ఆర్. కాలనీలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల తనిఖీ

కలెక్టరేట్‌లో సమీక్ష, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్ల పరిశీలన

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశం

కామారెడ్డి జిల్లాప్రతినిధి ప్రశ్న ఆయుధం సెప్టెంబర్3     

జిల్లాలో ఈనెల 4వ తేదీ గురువారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి మంగళవారం పరిశీలించారు.

తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ వద్ద ముఖ్యమంత్రి హెలిక్యాప్టర్ దిగేందుకు సిద్ధం చేసిన హెలిపాడ్‌ను పరిశీలించి, పర్యటనలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని ఆర్డీవో కామారెడ్డి, తాడ్వాయి తహసీల్దార్‌లకు సూచనలు ఇచ్చారు. అనంతరం లింగంపేట్ మండలంలోని లింగంపల్లి కుర్దు వంతెనను పరిశీలించిన కలెక్టర్, వరదల కారణంగా బ్రిడ్జి దెబ్బతిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రికి చూపించేలా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డిని ఆదేశించారు.

బుడిగిడా గ్రామంలో వరదల కారణంగా దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన కలెక్టర్, జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలను ముఖ్యమంత్రికి సమగ్రంగా వివరించేందుకు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు.

కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి నిర్వహించనున్న అధికారులతో వరదలపై సమీక్ష, ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సీఎం పర్యటన సాఫీగా జరిగేలా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) చందర్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, మున్సిపాలిటీ, వ్యవసాయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment