76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జెండా ఆవిష్కరించిన కలెక్టర్ 

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జెండా ఆవిష్కరించిన కలెక్టర్

IMG 20250126 WA0020

ఆయుధం కామారెడ్డి

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తొలుత కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పతాకావిష్కరణ గావించినారు. అనంతరం జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయంలో పతాకావిష్కరణ గావించినారు. అనంతరం కలెక్టరేట్ లో జరిగిన వేడుకలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , ఎస్పీ సింధు శర్మ లు పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పతాకావిష్కరణ చేశారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ ప్రసంగించారు. రైతు రుణమాఫీ పై మాట్లాడుతూ రైతును రాజుగా చేయాలనే తలంపుతో తొలిసారిగా రెండు లక్షల రూపాయల వరకు ఒకే దఫాలో రైతులను రుణ విముక్తి చేయడం జరిగిందన్నారు జిల్లాలో పంటల రుణమాఫీ 1, లక్ష, 258 మంది రైతులకు 718 కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా కింద వ్యవసాయ అభివృద్ధి రైతు సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యత అంశంలో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12 వేలకు పెంచడం జరిగిందన్నారు వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని నేటి నుండి అందించడానికి నిర్ణయం చేసిందని చెప్పారు. ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదల్చుకుంటే వీటిని స్వీకరించి పరిశీలన చేయబడతాయి అన్నారు. గత నాలుగు రోజులుగా జరిగిన గ్రామ సభలకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలోని ప్రజాపాలన సేవ కేంద్రాలలో దరఖాస్తులు ఇవ్వవచ్చని పరిశీలన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులను మంజూరు చేద్దామన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న రెండు లక్షల, 54 వేల రేషన్కార్ల ద్వారా నెలకు 454 మెట్రిట్ టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చేయూత పథకం ద్వారా కామారెడ్డి జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి ఒక లక్ష, 64,000 మంది పింఛన్ లబ్ధిదారులకు ప్రతినెల 36 కోట్ల 67 లక్షల రూపాయలను పంపింది చేయడం జరుగుతుందన్నారు.

IMG 20250126 WA0019 కు గ్యాస్ సిలిండర్ సరఫరా మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1, 49 318 మంది వినియోగదారులకు రెండు లక్షల 97 వేల,121 గ్యాస్ సిలిండలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. దీని కాను ప్రభుత్వం 13 కోట్ల 80 లక్షల రూపాయలను సబ్సిడీ అంచిందని అందించిందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభించిందని, జిల్లాలో ఇప్పటివరకు రెండు కోట్ల 19 లక్షల82,000 మంది మహిళలు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఉచిత టికెట్ల ద్వారా మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వినియోగించుకున్నారన్నారు. దీని ద్వారా మహిళలకు 101 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది అన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గృహ జ్యోతి ఇందిరమ్మ ఇండ్లు తదితర వాటిపై ఆయన వివరించారు.

IMG 20250126 WA0021 ఉచిత బస్సు ప్రయాణం, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు డైట్ మరియు కాస్మోటిక్ చార్జీల పెంపు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గృహజ్యోతి ఇందిర మైండ్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ తదితర వాటిపై ఆయన ప్రజలకు వివరించారు జిల్లాలో ప్రస్తుతం సంవత్సరంలో 17వేల మంది నిరుపేదలకు శాస్త్ర చికిత్సలు చికిత్స గురించి 38 కోట్ల 40 లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందన్నారు. నేటి నుండి అమలు చేయబడుతున్న ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మొదలగు పథకాలలో ఇంకను మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి వారిని ఈ పథకంలో చేర్చడం జరుగుతుందన్నారు. ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించిందని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేయని వారు చేసిన వారు ఈ జాబితాలో పేరు లేని వారు మండల, మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన సేవ కేంద్రాల్లో తిరిగి దరఖాస్తు తీసుకోవాలన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు పత్రిక విలేకరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుటకు అందరి సహాయ సహకారాలు ఆశిస్తున్నానని మరొకసారి జిల్లా ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం రాజంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాన్సువాడ బి.సి.హాస్టల్ విద్యార్థినిలచే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఆ తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులకు జ్ఞాపికలను కలెక్టర్ అందజేశారు. సి.ఏం.కప్ క్రీడోత్సవాల నిర్వహణ కోసం విరాళాలు అందించిన సఫల ఫార్మా ఇండస్ట్రీస్ ఏం.డి. పైడి ఎల్లారెడ్డి, గాయత్రి షుగర్స్ ఏం.డి. వేంకటేశ్వర రావు లను సత్కరించారు. అనంతరం సి.ఏం. కప్ క్రీడల్లో విజేతలకు బహుమతి ప్రదానం, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ( ట్రేని ఎస్పి ) ఎస్.పి. చైతన్య రెడ్డి, జిల్లా అటవీ అధికారిణి నిఖిత, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, అధికారులు, పలు శాఖల ఉద్యోగులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment