*రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్*
వేములవాడ,జనవరి 05
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కమిషనర్ దంపతులకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కోడె మొక్కు చెల్లించుకున్నారు. స్వామి వారి కల్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వాదం చేశారు.