Site icon PRASHNA AYUDHAM

సామాన్యులు ఎప్పుడు క్షేమంగా ఉంటారు మోడీ జీ?: రాహుల్..

IMG 20241110 WA0025

సామాన్యులు ఎప్పుడు క్షేమంగా ఉంటారు మోడీ జీ?: రాహుల్..

సామాన్యులు ఎప్పుడు క్షేమంగా ఉంటారు మోడీ జీ?: రాహుల్
‘మోడీ జీ.. మీ పాలనలో సామాన్యులు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు?’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇవాళ బిహార్‌లో రైలు ఇంజిన్, బోగీల మధ్య చిక్కుకొని ఉద్యోగి చనిపోయిన ఘటనపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. ‘మీరేమో అదానీని రక్షించడంలో బిజీగా ఉన్నారు. ఈ భయానక చిత్రం రైల్వేలో సుదీర్ఘకాలంగా తాండవిస్తున్న నిర్లక్ష్యానికి, అంతంతమాత్రంగానే జరుగుతున్న నియామకాలకు నిదర్శనం’ అని ట్విట్టర్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.

Exit mobile version