సిపిఎం పార్టీ బూర్గంపాడుమండల కార్యదర్శి బత్తులవెంకటేశ్వర్లు
సెప్టెంబర్ 17న సారపాక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఎస్.కె అబిదా అధ్యక్షతన జరిగిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు చిట్యాల ఐలమ్మ ఫోటోకి సీనియర్ నాయకులు వై అప్పారావు
పూలమాల వేసి ఘనంగా వీర తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించిన 4000 మందికి అమరవీరులకు జోహార్లు జోహార్లు అని నినాదాలు ఇవ్వటం జరిగినది అదేవిధంగా బత్తుల మాట్లాడుతూ భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట 3000 గ్రామాల్లో విస్తరించిందని 10 లక్షల భూమి వ్యవసాయ కార్మికులకు పేదలకు పంచిపెట్టిన కమ్యూనిస్టులని తెలిపారు.
ఈ పోరాటంలో వేలాదిమంది
వీర మరణం పొందారని కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైన నాటి నుంచి పుచ్చలపల్లి సుందరయ్య చంద్ర రాజేశ్వరావు మరో ముగ్గురు తో తొలి సమావేశం జరిగిందని నిజాం ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీగా 1941లో ఏర్పడిందని ఎర్రజెండా నాయకత్వంలో రైతంగం తిరుగుబాటు జరిగి ఉండకపోతే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశంలో
విలీనమయ్యే పరిస్థితి ఉండేది కాదన్నారు.
ఇది ఎర్రజెండా విజయమని ఆనాటి పోరాటం ఫలితంగానే తెలంగాణలో ఇప్పటికి అనేక ఉద్యమాలు కొనసాగుతున్నాయని అన్నారు కేంద్రంలో బిజెపి ఆర్ఎస్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం
నాటి చరిత్రను వక్రీకరిస్తూ రెండు సినిమాలు విడుదల చేసి ప్రజలను తప్పుదావ పట్టించి ఎన్నికల్లో ఓట్లను దండుకుందని ఆవేదన వ్యక్తం చేశారు సెప్టెంబరు 17న చరిత్రలో ఏం జరిగింది దానికి ప్రాధాన్యత ఏమిటి ఎందుకు ఇంత వివాదాస్పద మవు
తున్నదో ఇవన్నీ లోతుగా పరిశీలించాలని సూచించారు
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కనకం వెంకటేశ్వర్లు,
ఆదురి నరసింహారావు బోళ్ల ధర్మ మోహన్
సతీష్ వీరన్న చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.